AP: ఏలూరులో కొత్త పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నట్లు వైసీపీ వెల్లడించింది. కొన్నిరోజుల్లోనే అది అందుబాటులోకి వస్తుందని తెలిపింది. ‘ఏలూరు వైసీపీ ఆఫీసు ఖాళీ. ఇక పార్టీ ఆఫీసు అవసరం లేకపోవటంతో, ఆఫీసు కూల్చేసి హోటల్ కడుతున్న నేతలు’ అని టీడీపీ Xలో పెట్టిన పోస్టుపై మండిపడింది. ‘లీజు ముగిసిన బిల్డింగ్ను ఖాళీ చేసినా.. తప్పుడు ప్రచారమేనా?’ అంటూ కొత్త కార్యాలయం ఫొటోలను YCP షేర్ చేసింది.