విశాఖ జిల్లా పెందుర్తి మండలం అక్కిరెడ్డిపాలెం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టాటా ఏస్ వ్యాన్ ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా 10 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతులు ప.గో జిల్లా కొవ్వూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. శ్రీకాకుళంలో పెళ్లికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.