ఒక రోగిపై సెక్యూరిటీ సిబ్బంది దాడి చేసి, అతడిని కిందకు తోసి కాలితో తన్నారు. ఉత్తరప్రదేశ్లోని రాయబరేలి ఎయిమ్స్లో ఈ షాకింగ్ ఘటన జరిగింది. సిబ్బంది మాత్రమే వినియోగించే లిఫ్ట్లోకి ప్రవేశించేందుకు ఒక రోగి ప్రయత్నించాడు. అయితే అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది ఆ వ్యక్తి పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ఆ రోగిని కొట్టడంతోపాటు కిందకు తోసి కాలితో తన్నారు. ఇదంతా అక్కడి సీసీ టీవీలో రికార్డయింది.