కర్ణాటకలోని ఉడిపిలో రానున్న లోక్సభ ఎన్నికలను బహిష్కరించాలని ఓ గ్రామం నిర్ణయించుకుంది. చిక్కమగళూరు లోక్సభ నియోజకవర్గంలోని కాపు అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్న కట్టింగేరి గ్రామస్థులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తమ గ్రామంలో రోడ్లు, వంతెనలు, ఫంక్షనల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ వంటి అవసరమైన సౌకర్యాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.