పాడేరు ఘాట్ రోడ్డులో ప్రమాదం.. ఇద్దరు మృతి

105415చూసినవారు
పాడేరు ఘాట్ రోడ్డులో ప్రమాదం.. ఇద్దరు మృతి
అల్లూరి జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బొలెరో వాహనం లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతిచెందిన వారు సిరిగాం జయంతి(20), సోన్ను బోయి(50)గా గుర్తించారు. ప్రమాద సమయంలో వాహనంలో 30 మంది కూలీలు ఉన్నారు. ఒడిశాకు చెందిన వలస కూలీలుగా గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్