రామాలయ రథానికి నిప్పు

50చూసినవారు
రామాలయ రథానికి నిప్పు
అనంతపురం జిల్లా కనేకల్ మండలం హనకనహాల్‌లో మంగళవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. శ్రీరామాలయం రథానికి గుర్తు తెలియని దుండగులు నిన్న అర్ధరాత్రి నిప్పు పెట్టారు. స్థానికులు మంటలు ఆర్పి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విషయం తెలుసుకుని ఘటనా స్థలం వద్ద బీజేపీ, భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్