టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు గురువారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను కృష్ణలంక పోలీస్స్టేషన్కు తీసుకొచ్చారు. కాసేపట్లో వంశీను జడ్జి ముందు హాజరు పరచనున్నారు. మరో వైపు వంశీ అరెస్ట్ నేపథ్యంలో కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్తతలు చెలరేగా అవకాశం ఉండడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.