AP: వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కు ఎస్కార్ట్గా ఉన్న 11 మంది పోలీసులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. పోలీసుల అదుపులో ఉన్న చేబ్రోలు కిరణ్పై గోరంట్ల దాడికి యత్నించారు. ఆ సమయంలో పోలీసులు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఉన్నతాధికారులు నిర్ధారణకు వచ్చారు. గుంటూరు అరండల్పేట, నగరంపాలెం, పట్టాభిపురం పీఎస్ల పరిధిలోని పోలీసులపై చర్యలు తీసుకున్నారు.