ఏపీలో వారందరికి ప్రభుత్వం శుభవార్త

82చూసినవారు
ఏపీలో వారందరికి ప్రభుత్వం శుభవార్త
పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంలో పొరుగు సేవల సిబ్బందికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభవార్త చెప్పారు. గత ప్రభుత్వం సిబ్బందికి జీతాలు బకాయి పెట్టింది. ఆ జీతాలు చెల్లించాలని ఇటీవల వారు విజయవాడలోని పంచాయతీరాజ్ ఈఎన్‌సీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. పవన్ దృష్టికి వెళ్లడంతో.. వెంటనే సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ మేరకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిపాలన నిధుల నుంచి బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది.

సంబంధిత పోస్ట్