అవినీతి కేసులో గుంతకల్లు డీఆర్ఎం అరెస్ట్

58చూసినవారు
అవినీతి కేసులో గుంతకల్లు డీఆర్ఎం అరెస్ట్
అవినీతి కేసులో గుంతకల్లు డీఆర్ఎం వినీత్ సింగ్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. కడప జిల్లాకు చెందిన ఓ రైల్వే కాంట్రాక్టర్‌ను రైల్వే అధికారులు లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రైల్వే అధికారులపై సీబీఐకి కాంట్రాక్టర్ రమేష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. కాంట్రాక్టర్ ఫిర్యాదు మేరకు అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు గుంతకల్లు డీఆర్ఎం వినీత్‌తో పాటు కుంద్రా ప్రదీప్ బాబు, అక్కిరెడ్డి, లక్ష్మీపతి, రాజు, అక్కిరెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకుంది.

సంబంధిత పోస్ట్