సుప్రీంకోర్టు ఆదేశాలు.. స్పందించిన సీఎం చంద్రబాబు

67చూసినవారు
సుప్రీంకోర్టు ఆదేశాలు.. స్పందించిన సీఎం చంద్రబాబు
తిరుమల లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ‘సత్యమేవ జయతే, ఓం నమో వేంకటేశాయ’ అని పేర్కొన్నారు. కాగా, ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ స్వతంత్ర సిట్‌లో సీబీఐ నుంచి ఇద్దరు అధికారులు, ఏపీ ప్రభుత్వం నుంచి ఇద్దరు పోలీసు అధికారులు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి ఒక అధికారి ఉండాలని పేర్కొంది.

సంబంధిత పోస్ట్