సీఎం చంద్రబాబుతో తో భేటీ అయిన హర్యనా గవర్నర్

69చూసినవారు
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని హర్యానా గవర్నర్ బండారు దత్రాత్రేయ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడ నుండి తాడేపల్లి పరిధి ఉండవల్లి లోని సీఎం చంద్రబాబు నివాసానికి చేరుకున్న గవర్నరు కు సీఎం పుష్పకుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం వీరు కొద్దిసేపు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురు చర్చించుకున్నారు. అనంతరం గవర్నరును శాలువాతో సీఎం సత్కరించారు.

సంబంధిత పోస్ట్