

బాపట్ల: టిడిపి నేతకు వార్నింగ్ ఇచ్చిన జైభీమ్ రావ్ భారత పార్టీ
బాపట్ల తెదేపా అధ్యక్షుడు గొల్లపల్లి శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలకు జై భీమ్ రావ్ భారతపార్టీ జిల్లా అధ్యక్షుడు పర్రె కోటయ్య ఖండించారు. శుక్రవారం బాపట్ల కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గొల్లపల్లి శ్రీనివాస్ అక్రమ కట్టడాలపై నేను సాక్షాధారాలతో సహా నిరూపిస్తానని గొల్లపల్లిఎక్కడికి రమ్మన్నా వస్తానని పేర్కొన్నారు. జై భీమ్ రావ్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.