
'ప్లాస్టిక్ రహిత బాపట్ల కోసం కఠినంగా వ్యవహరిస్తున్నాం'
బాపట్ల మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా కొనుగోలు చేసిన జేసీబీ క్రేన్, ట్రాక్టర్లను ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ సోమవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ. బాపట్ల మున్సిపాలిటీ దోమల రహిత మున్సిపాలిటీగా తయారు చేయాలన్నారు. మంచి మున్సిపాలిటీ తయారు చేసే విధంగా ముందుకు వెళ్తున్నామన్నారు. ప్లాస్టిక్ రహిత బాపట్లను తయారు చేసుకోవడానికి ఎంతో కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు.