బొల్లాపల్లిలో 17 కుటుంబాలు జనసేనలో చేరిక
బొల్లాపల్లి మండలం సరికొండపాలెం తండా వైసీపీ పార్టీ నుంచి 17 కుటుంబాలు వినుకొండ జనసేన పార్టీ ఇంచార్జ్ కొంజేటి నాగ శ్రీను రాయల్ ఆధ్వర్యంలో ఆదివారం జనసేనలో చేరారు. వారికి నాగ శ్రీను రాయల్ జనసేన జెండా కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో జనసేన పార్టీలోకి మరెన్నో చేరికలు ఉంటాయి అన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు.