వైసీపీ వర్గీయులపై టీడీపీ, జనసేన నాయకులు దాడి
మహాశివరాత్రి సందర్భంగా గోవాడ తిరుణాలలో జరిగిన ఘర్షణ చిలికి చిలికి గాలి వానలా మారింది. అర్ధరాత్రి వైసిపి నాయకులు ఇళ్లకు వెళ్లి జనసేన, టిడిపి నాయకులు దాడి చేశారు. చెరుకుపల్లి మండలం ఆరేపల్లి పంచాయతీలోని పుట్టవారి పాలెం గ్రామంలో శనివారం అర్ధరాత్రి గ్రామంలో విద్యుత్ తీసివేసి మూకుమ్మడిగా దాడి చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. దాడి చేసేందుకు వచ్చిన వారు 11 బైకులు వదిలి పరారైనట్లు గ్రామస్తులు తెలిపారు.