మద్యం తరలిస్తూ పట్టుబడిన టీడీపీ నేతలు
దాచేపల్లి మండలం పొందుగల చెక్పోస్టు వద్ద ఎస్ఈబీ అధికారులు వాహనాల తనిఖీలు చేపట్టారు. తనిఖీలో సోమవారం తెలంగాణ నుంచి కారులో అక్రమంగా మద్యం తరలిస్తున్న గురజాల 11వ వార్డు టీడీపీ కౌన్సిలర్ చాగంటి శ్రీనివాసరావు, కొండలును అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి 36ఫుల్ బాటిళ్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. వీరికి సహకరించిన గురజాల పట్టణ ఏఎస్సై(స్టేషన్ రైటర్) స్టాలిన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.