అనకాపల్లిలో విషాదం చోటు చేసుకుంది. చిన్న విషయానికే భర్తతో గొడవపడి భార్య ఆత్మహత్య చేసుకుంది. జ్యోతి తనను బయటికి తీసుకెళ్లాలని భర్త అబ్దుల్ గనికి చెప్పింది. భర్త పట్టించుకోకపోవడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. దీంతో జ్యోతిని తన తల్లి మందలించింది. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన జ్యోతి మేడ పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించింది.