ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు: ఎస్పీ సతీష్ కుమార్

79చూసినవారు
ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు: ఎస్పీ సతీష్ కుమార్
వినాయక చవితి విగ్రహాల ఊరేగింపు, నిమజ్జనోత్సవాలలో కమిటీ సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ తెలిపారు. అవాంఛనీయ ఘటనలు తలెత్తడానికి అవకాశం లేకుండా కమిటీ సభ్యులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరైనా ఘర్షణలకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పోలీస్ శాఖ సూచనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో వినాయక విగ్రహాల ఊరేగింపు నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్