విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దు: గుంటూరు ఎమ్మెల్యే

77చూసినవారు
విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దు: గుంటూరు ఎమ్మెల్యే
సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం వీడి ప్రజలకు జవాబు దారితనంగా ఉండాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి సూచించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలొని పలు సచివాలయాల సిబ్బందితో బుధవారం ఎమ్మెల్యే సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని, ప్రజలకు నిర్లక్ష్యపు సమాధానాలు ఇస్తున్నట్లు తనకు ఫిర్యాదులు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్