కేసానుపల్లిలో డిఎంహెచ్ఓ పర్యటన

1048చూసినవారు
దాచేపల్లి మండలం కేసానుపల్లిలో డిఎంహెచ్ఓ రవి శనివారం పర్యటించారు. శుక్రవారం కలుషిత నీరు తాగి వాంతులు, విరేచనాలతో 11 మంది అస్వస్థతకు గురికావడంతో. గ్రామంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో పరిస్థితి అదుపులోకి వచ్చేవరకు మెడికల్ క్యాంపులు, డాక్టర్లు 24గంటలు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఇప్పటివరకు 11 మంది అస్వస్థతకు గురయ్యారని, వారందరి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్