అనారోగ్యంతో ఆత్మహత్య

50చూసినవారు
అనారోగ్యంతో ఆత్మహత్య
మనస్తాపానికి గురై ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. మాచర్ల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన దగ్గుల బ్రహ్మారెడ్డి (40) గత నెల రోజులుగా పక్షవాతంతో బాధ పడుతున్నాడు. దీంతో మనస్తాపానికి గురై తాళ్లపల్లి శివారులోని పొలాల్లో శనివారం పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై పట్టాభిరామయ్య కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్