టిడిపి ఆఫీసు పై దాడి కేసులో 110 మంది గుర్తింపు: ఎస్పీ

74చూసినవారు
టిడిపి ఆఫీసు పై దాడి కేసులో 110 మంది గుర్తింపు: ఎస్పీ
టిడిపి ఆఫీసుపై దాడి కేసులో 110 మందిని గుర్తించినట్లు గుంటూరు ఎస్పీ సతీష్‌కుమార్‌ తెలిపారు. మంగళగిరి లో ఎస్పీ సతీష్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ అరెస్ట్‌ చేయొద్దంటూ చాలా మంది కోర్టుకెళ్లారని, వారిలో మినహాయింపు పొందినవారిని త్వరలో విచారణకు పిలుస్తామని చెప్పారు. పోలీస్‌ విచారణలో నందిగం సురేష్‌ సహకరించారని అన్నారు. సురేష్‌ చెప్పిన సమాధానాలు క్రాస్‌ చెక్‌ చేసుకుంటామని తెలిపారు.

సంబంధిత పోస్ట్