మంగళగిరిలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్

68చూసినవారు
మంగళగిరి నగరంలోని ఎయిమ్స్ గేటు సమీపంలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 3. 5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సీఐ వినోద్ కుమార్ తెలిపారు. శుక్రవారం పట్టణ పోలీస్ స్టేషన్ లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యర్రబాలెంకు చెందిన ముగ్గురు అరకు నుండి గంజాయి తెచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు తెలిపారు. కేసు నమోదుచేసి ధర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్