తాళ్లూరులో శోభా యాత్ర

590చూసినవారు
పెదకూరపాడు మండలం 75త్యాల్లూరు గ్రామంలో శుక్రవారం అన్నపూర్ణాదేవికి ఆషాఢం సారే సమర్పణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామంలో వినాయక దేవాలయం నుండి పురవీధులలో శోభాయాత్రతో బయలుదేరి శ్రీ అన్నపూర్ణాదేవి ఆలయానికి చేరుకున్నారు. పలు రకాల పూలు, పండ్లు, పసుపు కుంకుమలు, నైవేద్యాలు, చీరలు అమ్మవారికి సమర్పించారు. ఆలయ పూజారులు నుదురుపాటి హనుమంతరావు శర్మ , హరినాధశర్మ పూజలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్