ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే బూర్ల

54చూసినవారు
ప్రత్తిపాడు మండల కేంద్రంలో సోమవారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ప్రారంభించారు. ముందుగా సచివాలయం వద్ద సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి కూటమి శ్రేణులతో కలిసి పాలాభిషేకం చేశారు. అనంతరం ఇంటింటికి వెళ్లి పెన్షన్లను పంపిణీ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం మూడు నెలలు కలిపి మొత్తం రూ. 7 వేలు ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్