విద్యార్థినులతో ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన

79చూసినవారు
విద్యార్థినులతో ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలంలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈడుపుగల్లు గ్రామంలోని ఓ పాఠశాలలో పనిచేసే మండవ వెంకట శ్రీనివాస్‌ గత కొంతకాలంగా విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని బాధిత విద్యార్థినులు తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో వారు కంకిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్