నేతి వెంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్దికి కృషిచేశా: మంత్రి
ఈ ప్రభుత్వ హయాంలో నేతి వెంకన్న స్వామివారి ఆలయాన్ని సెంట్మెంట్గా భావించి పూర్తి స్దాయిలో అభివృద్ది చేశామని, ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేడుకలు, పూజలు నిర్వహించాలని, మంచినీటి కొరత లేకుండా చూడాలని అధికారులు, ఆలయ కమిటీని రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు అంబటి రాంబాబు ఆదేశించారు. గురువారం రాజుపాలెం మండలంలోని దేవరంపాడు ఆలంలో రూ. 1. 20 కోట్లతో చేసిన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు.