ప్రాజెక్టు ఈఈగా బాధ్యతలు చేపట్టిన సుబ్రహ్మణ్యం
రెంటచింతల మండలంలోని సత్రశాల వద్ద కృష్ణా నదిపై నిర్మితమైన నాగార్జునసాగర్ టైల్ పాండ్ విద్యుత్ ప్రాజెక్టు ఈఈ(సివిల్)గా బీఎస్ సుబ్రహ్మణ్యం మంగళవారం ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. ఆయన విజయవాడ విద్యుత్ సౌదా నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇప్పటిదాకా ఇక్కడ శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ ప్రాజెక్ట్కు చెందిన రమేష్ కుమార్ ఇన్ ఛార్జ్ గా వ్యవహరించారు.