సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వైసిపికి ఓటు వేయాలని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు కోరారు. సోమవారం నిజాంపట్నంలో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఈవూరు గణేష్, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సుస్థిర పరిపాలన నిరంతరం కొనసాగాలంటే రాబోవు ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైసిపి అభ్యర్థులను గెలిపించాలన్నారు. వైసిపి నాయకులు పాల్గొన్నారు.