Mar 30, 2024, 02:03 IST/కరీంనగర్
కరీంనగర్
వడదెబ్బతో ఆశా వర్కర్ మృతి
Mar 30, 2024, 02:03 IST
వడదెబ్బతో ఓ ఆశా వర్కర్ కరీంగనర్ జిల్లాలో మృతి చెందింది. స్థానికుల వివరాల ప్రకారం. తిమ్మాపూర్ మండలం నేదునూర్ గ్రామానికి చెందిన రాజేశ్వరి(50) ఆశా కార్యకర్తగా పని చేస్తున్నారు. అయితే ప్రభుత్వం చేపట్టిన సర్వేలో భాగంగా గురువారం ఎండలో ఇంటింటికి తిరుగుతుండగా ఎండకు అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రిలో చేర్పించగా చికిత్సపొందుతూ శుక్రవారం మృతి చెందారు.