‘నా మనవడు ఎక్కడ’?.. అతుల్‌ తండ్రి ఆందోళన

70చూసినవారు
భార్య వేధింపులు తాళలేక టెకీ ఆత్మహత్య చేసుకొన్న కేసులో ఆయన భార్య నిఖితాను బెంగళూరు పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ‘నా మనవడు ఎక్కడ’ అంటూ అతుల్ తండ్రి పవన్ కుమార్‌ మోడీ కోడలు నిఖితాను ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ‘2020లో అతుల్‌కు కుమారుడు జన్మించాడు. ఆ తర్వాత నిఖితా, నా కుమారుడు విడిపోయారు. నాటి నుంచి నా మనవడిని చూడలేదు. నా దగ్గర ఉంటేనే అతడు క్షేమంగా ఉంటాడు’ అని అతుల్ తండ్రి వాపోయారు.

సంబంధిత పోస్ట్