చంపింది అతనే.. ఎమ్మార్వో రమణయ్య సోదరుడి సంచలన వ్యాఖ్యలు

172276చూసినవారు
చంపింది అతనే.. ఎమ్మార్వో రమణయ్య సోదరుడి సంచలన వ్యాఖ్యలు
విశాఖపట్నం జిల్లా కొమ్మాదిలో తహశీల్దార్ రమణయ్య దారుణ హత్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. రమణయ్యను దారుణంగా రాడ్లతో కొట్టి చంపారు. ఈ హత్యపై రమణయ్య సోదరుడు రాజేంద్ర సంచలన ఆరోపణలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 'చీపురుపల్లిలో 7 ఎకరాల ల్యాండ్ కోసం కొంతకాలంగా మమ్మల్ని చంపేస్తామని బ్రోకర్ ప్రసాద్ బెదిరిస్తున్నాడు. నిన్న సైట్ వాచ్‌మెన్ ఫోన్ నుంచి కాల్ చేసి సాయంత్రం లోపు చంపేస్తామని అన్నాడు. మా సోదరుడ్ని చంపుతాడని ఊహించలేదు' అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్