ఈనెల 29న సుప్రీంకోర్టులో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసుపై విచారణ జరగనుంది. చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్లతో కూడిన ధర్మాసనం విచారించనుంది. ఐఆర్ఆర్ కేసులో ఈనెల 10న చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి విధితమే.