ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల

67చూసినవారు
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల
’’ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం జరిగింది. మా ప్రభుత్వం వచ్చాక కుంభకోణాలపై చర్యలు తీసుకుంటాం’’ అని నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై 8,03,612 ఫిర్యాదులు వస్తే ఏసీబీ అధికారులు ఏం చర్యలు తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. ‘‘కింది స్థాయి ఉద్యోగులపై దాడులు చేసేందుకు మాత్రమే ఏసీబీని ఉపయోగించారు. మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతిపై ఫిర్యాదులు వస్తే ఏం చర్యలు తీసుకున్నారు‘‘ అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్