మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవల్గా మారిన దస్తగిరికి ఎన్నికల సంఘం భద్రత పెంచింది. గురువారం సీఎం జగన్తో పాటు దస్తగిరి కూడా నామినేషన్ వేయనున్నారు. ఈ క్రమంలో ఆయన భద్రతను ఫోర్ ప్లస్ ఫోర్, టెన్ ప్లస్కు పెంచి ఇవాళ, రేపు భద్రత ఇవ్వనున్నారు. కాగా, తన నామినేషన్ను అడ్డుకోవాలని వైసీపీ చూస్తోందని దస్తగిరి ఆరోపించారు.