సీఎం జగన్పై రాయి దాడి కేసులో కీలక అప్డేట్ వచ్చింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సతీష్ను పోలీస్ కస్టడీకి ఇస్తూ విజయవాడ కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. మరో మూడు రోజులు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. థర్డ్ డిగ్రీ ప్రయోగించవద్దని హెచ్చరించింది. దీంతో ఈ నెల 27న పోలీసులు సతీష్ను మరోసారి విచారించనున్నారు.