అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ఎర్రగుంట్లలో దారుణం చోటు చేసుకుంది. తన కుమార్తె హైదరాబాద్లో స్థిరపడటంతో ఓబులమ్మ(84) ఒంటరిగానే ఉంటోంది. అదే గ్రామానికి చెందిన కృష్ణమూర్తి ఇంట్లో శుభకార్యం కోసం 7 తులాల బంగారు నగలను ఓబులమ్మ ఇచ్చింది. 15 రోజులైనా వారు తిరిగి ఇవ్వకపోవడంతో గ్రామ పెద్దలను ఆశ్రయించింది. ఆగ్రహించిన కృష్ణమూర్తి కుటుంబసభ్యులు శుక్రవారం ఆమెను గొడ్డలితో నరికి చంపారు. శరీర భాగాలను ముక్కలు చేసి పెనకచర్ల డ్యామ్లో పడేశారు.