ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్పోర్టు దుబాయ్లో నిర్మాణం కానుంది. ఈ ప్రాజెక్టు కోసం రూ.2.9లక్షల కోట్లు ఖర్చు చేయనున్నారు. దీనిని అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయంగా పిలవనున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. 5 సమాంతర రన్వేలు, 400 ఎయిర్క్రాఫ్ట్ గేట్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న దాని కంటే కొత్తది 5 రెట్లు పెద్దగా ఉండనుందట. ఏడాదికి 260 మిలియన్ మంది ప్రయాణించేలా దీన్ని నిర్మిస్తున్నారు.