వైఎస్ షర్మిల మాట్లాడుతూ 'ధర్మానికి, డబ్బుకు మధ్య జరుగుతున్న ఎన్నికలివి. రాజశేఖర్రెడ్డి పేరు ఎఫ్ఐఆర్లో కూడా లేకపోతే ఏఏజీ సుధాకర్రెడ్డి చేర్పించారు. ఆయన పిటిషన్ల మేరకే వైఎస్ఆర్ పేరును సీబీఐ ఛార్జ్షీట్లో చేర్చింది. సొంత కొడుకై కూడా తండ్రి పేరును చేర్పించడానికి కృషి చేశాడు. ఇలా ఎవరైనా చేస్తారా? ఎంత దుర్మార్గమిది. కేసుల నుంచి బయటపడటానికి జగన్ చేసిన దుర్మార్గపు చర్య అది. ఈ కుట్రకు కారణం జగన్.' అంటూ ఆరోపించారు.