పరామర్శకు వచ్చి జగన్ హితబోధలు చేశారు: సోమిరెడ్డి

66చూసినవారు
పరామర్శకు వచ్చి జగన్ హితబోధలు చేశారు: సోమిరెడ్డి
AP: పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డిని ప‌రామ‌ర్శించేందుకు నెల్లూరు వ‌చ్చిన వైసీపీ అధినేత జ‌గ‌న్ హితబోధలు చేశార‌ని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి ఎద్దేవా చేశారు. "పిన్నెల్లి కేసులో చిన్నరాయి కారణంగా సీఐ తల పగిలిందట. ఈవీఎం పగలగొడితే తప్పేమిటని జగన్‌ అనడం దురదృష్టకరం. కోడికత్తి కేసులో శ్రీనుపై కనికరం లేకుండా ఐదేళ్లు జైలులో పెట్టారు." అని సోమిరెడ్డి మండిప‌డ్డారు.