సీఎం జగన్, వైసీపీ సర్కార్పై టీడీపీ చీఫ్ చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. "వైసీపీవి నవరత్నాలు కాదు.. నవమోసాలు. విద్యుత్ ఛార్జీలతో పాటు అన్ని ధరలనూ పెంచేశారు. మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపుల్లేవు. ఆ డబ్బంతా తాడేపల్లి ప్యాలెస్కు పోతోంది. ఉద్యోగాల్లేక యువత రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. జగన్ మీ బిడ్డ కాదు.. రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ." అని కురుపాం సభలో చంద్రబాబు అన్నారు.