ఏపీ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. రబీ పంట ఉత్పత్తుల కొనుగోలుకు శ్రీకారం చుట్టింది. ఆర్బీకేల ద్వారా పప్పు ధాన్యాల సేకరణకు అనుమతి ఇచ్చింది. గత నెలలో శనగల కొనుగోలుకు అనుమతి ఇవ్వగా తాజాగా మినుము, పెసలు, వేరుశనగ కొనుగోలు చేయనున్నారు. వీటి కోసం ఏపీ మార్క్ ఫెడ్ ఏర్పాట్లు చేసింది. క్వింటాల్ శనగలకు రూ.5,440, పెసలకు రూ.8,558, మినుముకు రూ.6,950, వేరుశనగకు రూ.5,850 చొప్పున కనీస మద్దతు ధర నిర్ణయించింది.