AP: వైసీపీ అధినేత జగన్పై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తీవ్ర విమర్శలు చేశారు. "వైసీపీ హయాంలో జరిగిన ఘోరాలపై అప్పట్లో సీఎంగా ఉన్న జగన్ ఎందుకు స్పందించలేదు? జగన్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రధాని మోదీ వల్లే దేశాభివృద్ధి సాధ్యం. కేంద్ర సహకారం లేనిదే ఏపీలో అభివృద్ధి సాధ్యం కాదు. ఏపీకి అన్ని రకాలుగా సాయం చేస్తోంది. తప్పుడు ప్రచారాల్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలి" అని ఆమె పేర్కొన్నారు.