పవన్‌ కల్యాణ్‌కు ఓఎస్డీగా కడప ఆర్డీవో..!

51చూసినవారు
పవన్‌ కల్యాణ్‌కు ఓఎస్డీగా కడప ఆర్డీవో..!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు ఓఎస్డీగా యువ అధికారి మధుసూదన్‌ను నియమించారు. ప్రస్తుతం ఆయన కడప ఆర్డీవోగా పనిచేస్తున్నారు. గతంలో ఆయన ధర్మవరం ఆర్డీవోగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో కడపలో పోలింగ్‌ ప్రశాంతంగా జరిగేందుకు మధుసూదన్‌ కీలక చర్యలు తీసుకున్నారు. అవి సత్ఫలితాలను కూడా ఇచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయన్ను ఏరికోరి పవన్‌ కల్యాణ్‌కు ఓఎస్డీగా నియమించారనే ప్రచారం జరుగుతోంది.

సంబంధిత పోస్ట్