హామీలు నూరుశాతం అమలు : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

755చూసినవారు
హామీలు నూరుశాతం అమలు : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం శుక్రవారం కొండాపురం మండలం శాంతినగర్ కాలనీలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ: 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పేదలను కనీసం పట్టించుకోకుండా కేవలం కార్పొరేట్ వ్యవస్థకు కొమ్ముకాసి కోట్ల రూపాయలు దోచుకున్నాడని, సీఎం జగన్ సంక్షేమం అందిస్తుంటే గుండెలు బాదుకోవడం ఎందుకు అని మండిపడ్డారు. బాబు హయాంలో ఎంత మంది పేదలకు మేలు చేశాడో శ్వేతా పత్రం విడుదల చేసే దమ్ము ఉందా అని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్