మైలవరం మండలం మోరగుడి గ్రామానికి చెందిన పలు కుటుంబాలు జమ్మలమడుగు నియోజకవర్గ ఇంఛార్జి భూపేష్ రెడ్డి సమక్షంలో.
టీడీపీ లో చేరారు. ఆదివారం భవిష్యత్ కు గ్యారెంటీలో భూపేష్ రెడ్డి అధ్వర్యంలో మధ్యాహ్నం నడిపి సుబ్బరాయుడు, మహారాజు, లింగారావు, పాండురంగడు కుటుంబాలకు చెందిన వారికి టిడిపి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. భూపేష్ మాట్లాడుతూ మోరగుడిలో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని
కోరారు.