గంజాయి తరలిస్తున్న నలుగురు అరెస్ట్

52చూసినవారు
గంజాయి తరలిస్తున్న నలుగురు అరెస్ట్
కమలాపురం మండలం చదిపిరాళ్లలో ఆదివారం ఒక దేవాలయం వద్ద ద్విచక్ర వాహనాలపై గంజాయి తరలిస్తున్న నలుగురిని అరెస్ట్ చేసినట్లు కమలాపురం సిఐ రేషన్ తెలిపారు. ఒకటిన్నర కేజీ గంజాయి, రూ. 19 వేలు నగదు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వివిధ నాన్ బెయిలబుల్ సెక్షన్ల పై అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరిచారు. చిట్టి ప్రతాప్ రెడ్డి, ఉరుమిళ్ళ శ్రీనివాసులు, నాగలరపు కిట్టయ్య, కర్నాటి నరేష్ లను అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్