వైసీపీ కార్యాలయాల కూల్చివేతలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో చట్ట నిబంధనలు పాటించాలని అధికారులను ఆదేశించింది. ప్రతి దశలోనూ
వైసీపీ తరపున వాదనలు వినిపించేందుకు అవకాశమివ్వాలని స్పష్టం చేసింది. పబ్లిక్కు ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉన్నప్పుడే కూల్చివేతలపై ఆలోచన చేయాలని తెలిపింది. రెండు నెలల్లో భవన నిర్మాణ అనుమతులు అధికారులకు సమర్పించాలని పిటిషనర్లకు సూచించింది.