ఉప్పలగుప్తం మండలం భీమనపల్లిలో శుక్రవారం అమలాపురం నియోజకవర్గ వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి పినిపే విశ్వరూప్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ తిరుగుతూ వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరించారు. వైసీపీ హయాంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించామని, మరోసారి వైసీపీ గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు. కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు పాల్గొన్నారు.