రాజమండ్రి రూరల్: రతన్ టాటాకు కడియం యువకుడితో అనుబంధం

68చూసినవారు
పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాతో కడియంకు చెందిన మార్గాని వెంకట శేషు అనే యువకుడికి ప్రత్యేక అనుబంధం ఉంది. ఏడేళ్లుగా శేషు, రతన్ టాటా అభిరుచులకు అనుగుణంగా ఆయనకు మెసేజ్‌లు, చిత్రాలు పంపించేవారు. ఈ సందర్భంగా శేషు గురువారం మాట్లాడుతూ రతన్ టాటాను మూడుసార్లు కలిసే అదృష్టం కలిగిందని తెలిపారు. ఆయనకి డ్రై ఫ్రూట్స్ లడ్డూలంటే ఇష్టం అన్నారు. రతన్ టాటా మృతికి దిగ్ర్భాంతికి గురయ్యానని అన్నారు.

సంబంధిత పోస్ట్